Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

  Pension Scheme: ఓల్డ్ పెన్షన్ స్కీమ్‌పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన కేంద్ర ప్రభుత్వం..

మీరే ప్రభుత్వ ఉద్యోగి అయితే లేదా మీ ఇంట్లో ఎవరైనా ప్రభుత్వ ఉద్యోగి ఉంటే, ఈ వార్త మీ కోసమే. కొన్ని రాష్ట్రాలు ‘ఓల్డ్ పెన్షన్‌ స్కీమ్‌‘ అమలుపై ప్రకటనపై కేంద్ర ప్రభుత్వం సోమవారం లోక్‌సభలో తన వైఖరిని స్పష్టం చేసింది.
అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి డాక్టర్ భగవత్ కరద్ సోమవారం లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. తన సమాధానంలో.. ఆర్థిక శాఖ సహాయ మంత్రి ‘పాత పెన్షన్ స్కీమ్’ అమలును నిర్ద్వంద్వంగా తిరస్కరించారు. పాత పింఛను విధానాన్ని అమలు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

పాత పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్)ని అమలు చేసేందుకు అనేక రాష్ట్రాలు తమ స్థాయిలో నోటిఫికేషన్లు జారీ చేశాయని ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ సమాధానంతో పరిస్థితి స్పష్టమైంది. ఎన్‌పిఎస్ డబ్బును తిరిగి చెల్లించే నిబంధన లేదని ప్రభుత్వం స్పష్టం చేయాలన్నారు. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, రాజస్థాన్, పంజాబ్ ప్రభుత్వాలు రాష్ట్ర ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి చేసిన ఈ ప్రకటన చాలా కీలకంగా మారనుంది.
రాష్ట్ర ప్రభుత్వాలు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించడంపై లోక్‌సభలో ప్రశ్నించిన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీకి ఆర్థిక శాఖ సహాయ మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నేషనల్ పెన్షన్ స్కీమ్ (ఎన్‌పిఎస్) డబ్బును తిరిగి ఇవ్వాలని ఈ ప్రభుత్వాలు డిమాండ్ చేశాయా అని ఆయన అడిగారు. దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, రానున్న కాలంలో పాత పింఛను విధానాన్ని అమలు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందా..? అని ప్రశ్నించారు. ఒవైసీ ప్రశ్నలకు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కరాద్ లిఖితపూర్వక సమాధానాలు ఇచ్చారు.

రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఈ విషయంలో తమ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం/పిఎఫ్‌ఆర్‌డిఎకు తెలియజేశాయని, భగవత్ కరద్ ప్రభుత్వ వైఖరిని స్పష్టం చేస్తూ పంజాబ్ ప్రభుత్వం నవంబర్‌లో నోటిఫికేషన్ జారీ చేసింది.
2022 నాటికి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించేందుకు పంజాబ్ ప్రభుత్వం నవంబర్ 18న నోటిఫికేషన్ జారీ చేసింది. రాజస్థాన్, జార్ఖండ్ మరియు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ఎన్‌పిఎస్ డబ్బును తిరిగి ఇవ్వడానికి ప్రతిపాదనను పంపాయి. అయితే పంజాబ్ ప్రభుత్వం నుంచి అలాంటి లేఖ ఏదీ అందలేదు. రాజస్థాన్, జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలకు ఎన్‌పిఎస్ డబ్బును వాపసు చేసే అవకాశం లేదని కేంద్ర మంత్రి స్పష్టం చేశారు.


No comments

Powered by Blogger.