Heeraben Modi Death: ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం.. హీరా బెన్ కన్నుమూత..

  


Heeraben Modi Death: ప్రధాని నరేంద్ర మోడీకి మాతృవియోగం.. హీరా బెన్ కన్నుమూత..



ప్రధానమంత్రి నరేంద్రమోడీకి మాతృవియోగం కలిగింది. గత కొన్ని రోజులుగా హీరా బెన్(100) అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించడంతో..
హీరాబెన్‌ను బుధవారం తెల్లవారుజామున అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ కొద్దిసేపటి క్రితం ఆమె తుదిశ్వాస విడిచారు. ప్రధాని తల్లి హీరాబెన్ మోడీ గాంధీనగర్ శివార్లలోని రైసన్ గ్రామంలో తమ్ముడు పంకజ్ మోడీతో కలిసి నివసిస్తున్నారు.

ప్రధాని మోడీ, తల్లి హీరాబెన్ మధ్య ప్రత్యేక అనుబంధం ఉంది. తాను అందుకుంటున్న విజయాల వెనుక తన తల్లి హీరాబెన్ ఉందని ఎప్పుడూ ప్రధాని మోడీ పలు సందర్భాల్లో గుర్తు చేసుకునేవారు. ప్రధాని మోడీ ఎంత బిజీగా ఉన్నా.. ఫోన్ కాల్ ద్వారా ఆమె క్షేమ సమాచారాలను తెలుసుకునేవారు. డిసెంబర్‌లో ప్రధాని మోడీ తల్లి హీరాబెన్‌ను కలిశారు, ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. గుజరాత్ ఎన్నికల ఓటింగ్ సందర్భంగా డిసెంబర్ 4న గాంధీనగర్‌లో ప్రధాని మోడీ తన తల్లి హీరాబెన్‌ను కలిశారు. ఈ సందర్భంగా అమ్మవారి పాదాలను తాకి ఆశీస్సులు తీసుకుని, ఆమెతో కూర్చొని టీ తాగారు. గుజరాత్ ఎన్నికలకు ముందు, జూన్ 18న తన 100వ పుట్టినరోజు సందర్భంగా మోడీ తన తల్లిని కలిశారు.

అంతకుముందు, ప్రధాని నరేంద్ర మోడీ మార్చి 11, 12 తేదీలలో గుజరాత్‌లో రెండు రోజుల పర్యటనలో ఉన్నప్పుడు, మార్చి 11న రాత్రి 9 గంటలకు తల్లి హీరాబెన్‌ను కలవడానికి గాంధీనగర్‌కు చేరుకున్నారు. అక్కడ ఆమె ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ ఆమెతో కలిసి కిచ్చీలు తిన్నారు.


No comments

Powered by Blogger.